పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు తామేం చేస్తున్నామో లెక్కలతో సహా చెప్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం అదే రీతిలో గణాంకాలను వివరించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను ఓ ట్వీట్లో మంత్రి కోరారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ ఆ వేదిక నుంచి బయటకు రావడం, ఏపీకి సంబంధించిన హామీలను నిలబెట్టుకోవడంలేదని ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు.
see also :ఉగాది పండగ రోజు కచ్చితంగా పాటించాల్సిన మూడు నియమాలు..!!
‘అభివృద్ధి పథం వైపు ఆంధ్రప్రదేశ్ సాగుతున్న తీరును ప్రతి ఒక్కరూ గమనించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజల కోసం నిర్విరామంగా కృషిచేస్తున్నాం. ఏపీ వృద్ధిని కొనసాగించేందుకు మద్దతు అందిస్తున్నారు’ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఓ ట్వీట్లో తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘గౌరవ మంత్రిగారు…ఇదే రీతిలో తెలంగాణకు సైతం మీరిచ్చిన హామీలు, నెరవేర్చుకున్న వాటి గణాంకాలు వివరించగలరా? మీకో విషయం గుర్తుచేస్తున్నాను…ఇదే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏపీలాగానే తెలంగాణకు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. గౌరవంతో…కేటీఆర్’ అంటూ ముగించారు!
see also : ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది..? కేటీఆర్ సంచలన ట్వీట్