ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ శ్రీవిళంబి నామ ఉగాది పండుగ పర్వదినాన అదిరిపోయే గిఫ్ట్ అందించారు.ఇటివల ఇటు రాష్ట్ర మంత్రి వర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేలు ,అటు ఎన్డీఏ మంత్రి వర్గం నుండి టీడీపీ ఎంపీలు బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.
అందులో భాగంగా రేపు సోమవారం టీడీపీ కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది.అయితే ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ,ప్రధాని మోదీ సలహాతో ఏపీ బీజేపీ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను నియమించారు.
అయితే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీను క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆయన్ని నియమించారు అని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.ఇటివల జరిగిన అసోం,త్రిపురల్లోని పార్టీను అధికారంలోకి నడిపించిన రామ్ మాధవ్ ను ఏపీకి నియమించడం వెనక బాబును రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఇలా ప్రణాళికలు రచించారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు .బాబుకు ప్రధాని మోదీ ఉగాది పండుగకు అదిరిపోయే కానుక ఇచ్చారని కమలం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు..