ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదల్లేదు అన్నట్లు ఉంది ప్రస్తుతం.గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడానికి ..తానూ ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణమైన జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటివల ఆయనపై రివర్స్ అయిన సంగతి విదితమే.
తాజాగా ఆయన ఉగాది పండుగ పర్వదినాన జనసేన పంచాంగం సందర్భంగా మాట్లాడుతూ బాబుకు ఉగాది పచ్చడి లో ఆరు రుచులుంటే ఏడో రుచి చూపించారు.ఆయన మాట్లాడుతూ గతంలో పదిహేను వందల ఎకరాలు రాజధానికి కావాలని నాకు చెప్పారు .ఆ తర్వాత లక్షల ఎకరాలు దోచుకున్నారు.
రైతులివ్వకపోతే కేసులు బనయిస్తున్నారు.మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ..రాచరిక వ్యవస్థలో ఉన్నామా అని ఆయన బాబును ప్రశ్నించారు.ఇంకా మాట్లాడుతూ నిత్యం భారీ వర్షాలు కురిసే నేలలో రాజధాని భవనాలు ఎలా కడతారు ..బురదలో కడితే అవి నిలబడతాయా ..ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నారు అని బాబుపై ఉగాది పండుగ నాడు విరుచుకుపడ్డాడు ..