ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలు ముఖ్యంగా ఎమ్మెల్యేలు మహిళలపై చేస్తున్న అరాచకాలకు ,దాడులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఈ క్రమంలో పొన్నూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర అండతో అధికార పార్టీకి చెందిన నేతలు మహిళలపై అక్రమ కేసులను బనాయించి పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
రాష్ట్రంలో చింతలపూడి గ్రామానికి చెందిన ఉషారాణి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే నరేంద్ర సహకారంతో స్థానిక నేతలు మహిళా అని చూడకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారు.అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచారు.
తన కుమారుడు గణేష్ ను గత నెలలో ఒక వ్యక్తి వాహనం మీద వచ్చి డీకొట్టడంతో కాలు విరిగింది.ఆపరేషన్ చేయించాం .అయితే ఆ వ్యక్తిపై కేసులు పెట్టాల్సింది పోయి తిరిగి ఎమ్మెల్యే సహకారంతో తనపై అక్రమ కేసులు పెడుతున్నారు అని ఆమె వాపోయారు .ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉండాలని ..తగిన ఆర్థిక సాయాన్ని అందించాలని గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ రావి వెంకటరమణను జగన్ ఆదేశించారు ..