ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పద్నాలుగు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.
అందులో భాగంగా జగన్ మీద ఉన్న అభిమానం ముందు ఒక యువకుడి అంగవైకల్యం కూడా ఓడిపోయింది.వైఎస్సార్ మీద వీరాభిమానం ముందు ఆయన అలుపు ఎరగని పోరాటం చేస్తున్నాడు తనఅంగవైకల్యం.
అయితే ఇంతకూ అసలు విషయం ఏమిటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రలో వికలాంగుడైన అనుపటి వెంకటయ్య పాదయాత్ర ప్రారంభమైన ఇడుపులపాయ నుండి నేటివరకు జగన్ తో నడుస్తున్నాడు.ఇదే విధంగా ఇచ్చాపురం వరకు నడుస్తాను అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు వెంకట్ .అంతే ఆత్మవిశ్వాసం ముందు జగన్ ,వైఎస్సార్ మీద అభిమానం ముందు ఆయన అంగవైకల్యం కూడా ఓడిపోయింది…