తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో శ్రీ విళంబి నామ సవంత్సర ఉగాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.ప్రగతి భవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ,ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,పార్టీ అభిమానులు ,కార్యకర్తలు ,నేతలు భారీ స్థాయిలో హాజరయ్యారు.ఈ సందర్భంగా పంచాంగ కర్తలు టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు,తెలంగాణ స్థితి గతుల గురించి పంచాంగం చెప్పారు.
ఈ క్రమంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రావణం చెబుతూ.. ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. తెలంగాణ అవతరించిన నాటి రాశి ,రాష్ట్రాన్ని పాలించే నాయకుడి రాశి ఒకటే కాబట్టి ఈ ఏడాది అన్ని శుభాలే .క్రీడారంగంలో తెలంగాణ మంచిగా వృద్ధి చెందుతుంది.సినీ రాజకీయ రంగానికి బాగుంటుంది.అక్టోబర్ మాసంలో వర్షాలు కురుస్తాయి.చెరువులు నిండుతాయి అని ..అన్ని రంగాల్లో స్త్రీలకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. డిసెంబర్లో వరదలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు.ఈ సంవత్సరం అందరూ పాటించాల్సిన సూచన.. ఆదివారం నాడు ఎవరూ కూడా మాంస భక్షణ చేయకుండా ఉంటే అందరికీ మంచి జరుగుతుందని తెలిపారు.