ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. రైతులు, యువతి,యువకులు,మహిళలు ఇలా అందరు చిన్న చిన్న కారణాల వల్ల వారి విలువైన జీవితాలను అర్ధంతరంగా ముగిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ఆత్మ హత్యలు చేసుకునే వారిలో పోలీసు కానిస్టేబుల్ సంఖ్య పెరుగుతుంది. తాజాగా విజయవాడ కృష్ణలంకలో నాగమణి అనే మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నాగమణి విజయవాడ నేరపరిశోధన విభాగం (సీసీఎస్)లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. ఆమె గత రాత్రి విధులు నిర్వహించి ఇంటికి వెళ్ళి ఆత్మహత్యకు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్ధలానికి చేరుకున్నకృష్టలంక పొలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఏపీ రాజధాని పక్కలోనే పోలీసుల ఆత్మహత్యలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
see also..ఏపీలో హోంగార్డు ఆంటీతో అక్రమ సంబంధం..చివరకు ఏమైయ్యింది..!
see also..భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు..!