టీమిండియాకు గెలుపు అసాధ్యం అనుకున్న స్థితిలో అసాధారణ రీతిలో చెలరేగిపోయాడు. కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులతో దినేశ్ కార్తీక్ వీర విహారం చేశాడు. భారత్కు విజయాన్నందించాడు. ఆదివారం రాత్రి నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 6 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయం సాధించింది.
see also..
జగన్ సీఎం అవ్వడం ఖాయం..!!
రెండు ఓవర్లలో 34 పరుగులు అవసరమైన స్థితిలో క్రీజులో అడుగుపెట్టిన దినేశ్.. వస్తూనే సిక్సర్ల మోత మోగించాడు. 19వ ఓవర్లో వరుసగా 6,4,6,0,4,2 చొప్పున 20 పరుగులు పిండుకున్న కార్తీక్.. ఆఖరి ఓవర్ చివరి బంతికి విజయానికి ఐదు పరుగులు అవసరమైన దశలో సిక్స్ కొట్టి ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించాడు. కార్తీక్ 8 బంతుల్లోనే 29 పరుగులు చేయడం అతడి విధ్వంసానికి అద్దం పడుతోంది.అద్భుతమైన ఆటతో చివరి బంతిని సిక్స్గా మలిచి భారత్ను గెలిపించిన కార్తీక్ వరల్డ్ రికార్డ్ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ట్రోఫీ ఫైనల్లో సిక్స్తో జట్టును గెలిపించిన తొలి బ్యాట్స్మెన్గా అతడు రికార్డ్ నెలకొల్పాడు. ఓవరాల్గా 1986లో ఆస్ట్రేలియాసియా కప్ ఫైనల్లో జావెద్ మియాందాద్ సిక్స్ బాదగా.. ఇన్నాళ్లకు దినేశ్ కార్తీక్ ఆ ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో చివరి బంతికి సిక్స్ బాది జట్టును గెలిపించిన ఐదో బ్యాట్స్మెన్గా దినేశ్ కార్తీక్ రికార్డ్ నెలకొల్పాడు. 2010లో కపుగెదర భారత్పై, 2012లో ఇయాన్ మోర్గాన్ భారత్పై, బాబర్ 2013లో విండీస్పై, సిబండ 2014లో నెదర్లాండ్స్పై ఈ ఫీట్ నమోదు చేశారు. టీ20ల్లో చివరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన ఏకైక బ్యాట్స్మెన్ దినేశ్ కార్తీక్ కావడం విశేషం.
see also..