ఎమ్మెల్యే.. అది అధికార పార్టీ . ఎమ్మెల్యే అయితే సదరు ఎమ్మెల్యే ప్రయాణించే కారులో ఫుల్ ఏసీ ..ఆ కారుకు ముందు ఒక ఎస్కార్టు వాహనం ..వెనక భారీ స్థాయిలో అనుచరవర్గం ప్రయాణించే కార్లు.ఇది మనం నిత్యం చూసే ఎమ్మెల్యేల కాన్వాయ్ .అయితే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కుత్భుల్లా పూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఈ రోజు సోమవారం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వినూత్న రీతిలో హాజరయ్యారు.
see also :కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం
ఉదయం ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కుత్భుల్లా పూర్ నుండి ఆర్టీసీ బస్సులో ఒక సామాన్యుడిలా ప్రయాణించారు.ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణికుల సమస్యలను ,ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అడిగి తెలుసుకున్నారు.అంతే కాకుండా ప్రయాణికులు నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి తెలియజేశారు.అందరిలాగా విని వదిలిపెట్టకుండా తనతో పాటు ఉన్న సిబ్బందిని వారు చెబుతున్న సమస్యలను నోటిపై చేయించి.. వెంటనే ఆ సమస్యలు పరిష్కారం కావాలని ..ఉన్నత అధికారులతో తానూ స్వయంగా మాట్లాడతాను అని చెప్పారు.
see also:హాట్సాఫ్ హరీష్ రావు..!!
ఈ సందర్భంగా బస్సులో ఉన్న ప్రయాణికులు తమ సమస్యల పట్ల ఎమ్మెల్యే స్పందించిన తీరుకు అభినందనలు తెలుపుతూ .. ప్రజల ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ అని ప్రశంసలు వర్షం కురిపించారు.అయితే కెపి వివేకానంద గౌడ్ గత నాలుగు ఏండ్లుగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కరించి నియోజక వర్గ ప్రజల మన్నలను పొందుతున్న సంగతి తెల్సిందే .