ఒక్కసారి ఎమ్మెల్యే అయితే తరతరాలు సెటిల్ అయిపోవచ్చు అనే అభిప్రాయంలో ఉన్నట్లు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే .అసలు విషయానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ,మంత్రుల జీతభత్యాలను పెంచాలనే నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించి రేపు బుధవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలో జీతాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నది.ఒకవేళ ఈ బిల్లుకు ఆమోదం పొందితే ఎమ్మెల్యేల ,మంత్రుల జీతాలు అమాంతం పెరిగిపోతాయి.అందులో భాగంగా మంత్రుల జీతాలను యాబై వేల నుండి తొంబై వేల మూడు వందలు,ఎమ్మెల్యేల జీతాలను ముప్పై వేల నుండి అరవై రెండు వేలకు పెంచనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒకరు మీడియాకు తెలిపారు.
అంతే కాకుండా అసెంబ్లీ సమావేశాల సమయంలో సభకు హాజరయ్యే వారికి ప్రత్యేకంగా యాబై వేల రూపాయలను విమాన ఖర్చుల కింద ఇవ్వనున్నారు ..జస్టీస్ జేఎమ్ జేమ్స్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జీతాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ..