Home / NATIONAL / బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ..!

బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ..!

భారతీయ జనత పార్టీకి బిగ్ షాక్ తగిలింది.గత సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎన్డీఏ నేతృత్వంలో నరేందర్ మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు.అమిత్ షా బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో ఆ పార్టీను గత సార్వత్రిక ఎన్నికలకు కంటే ముందుగా దేశ వ్యాప్తంగా క్షేత్రస్తాయికి బలోపేతం కావడానికి ప్రధాన
కారణమైన ఆ పార్టీ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు ప్రద్యుత్ బోరా బీజేపీ పార్టీ సభ్యత్వానికి ,పార్టీ పదవులకు రాజీనామా చేశారు.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తానూ పార్టీలో చేరిన 2004లో ఉన్న బీజేపీ పార్టీ కాదు.అప్పటి బీజేపీ పార్టీకి ఇప్పటి పార్టీకి చాలా తేడా ఉంది .ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారు.రాష్ట్రాల్లో ఎట్లైన సరే అధికారంలోకి రావాలని ప్రజాస్వామ్య విలువలకు తిలోదోకాలు వదులుతున్నారు అని ఆయన ఆరోపించారు .

బీజేపీ పార్టీలో సీనియర్లకు కానీ కష్టపడే వారికి ప్రాధాన్యత లేదు.తగిన గుర్తింపు ఇవ్వకపోవడమే కాకుండా పలు అవమానాలకు గురిచేస్తున్నారు అని పరోక్షంగా ఆ పార్టీ సీనియర్ నేత అయిన ఎల్ కే అద్వానీ సంఘటనను గుర్తు చేశారు .ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిస్థితులు మారాయి.ప్రజలు వేరే నాయకత్వాన్ని పార్టీను కోరుతున్నారు అని ఆయన అన్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat