Home / CRIME / 18 ఏళ్ళు కొడుకు ఉన్నా..తల్లి అక్రమ సంబంధం..ఏం జరిగిందో తెలిస్తే..!

18 ఏళ్ళు కొడుకు ఉన్నా..తల్లి అక్రమ సంబంధం..ఏం జరిగిందో తెలిస్తే..!

దేశంలొ ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. సభ్యసమాజం పక్కదారి పడుతోంది… మనుషుల మధ్య బంధాలు,బంధుత్వాలు బజారు పాలవుతున్నాయి… వావివరసలు మరిచి వికృత చేష్టలు చేస్తున్నారు… కుటుంబ గౌరవాలు కాటికి ఈడుస్తున్నారు… ఎంతో మంది కామానికి బలిపశువులై కర్కశంగా కామ దాహాన్ని తీర్చుకుంటున్నారు…వయసు,లింగబేధం లేకుండా ఎక్కడపడితే అక్కడ తమ నిజరూపాలను బయటపెడుతున్నారు మొన్న జరిగిన స్వాతి, దేవి ఉదంతాలే ఇందుకు నిదర్శనాలు. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కిరాతకంగా హత్య చేసింది ఒక మహిళ. హైదరాబాదు నగరంలో జరిగిన ఈ సంఘటన కలకలం రేగింది.

see also..

వైసీపీలోకి చిరుకి హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ..!

తాజాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వంగర మండలం, గీతనపల్లి గ్రామానికి చెందిన బంటుమిల్లి సింహాచలం(40), విజయలు భార్యాభర్తలు. వీరికి ఏసుబాబు, వేణు అనే ఇద్దరు కుమారులున్నారు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన సింహాచలం కుత్బుల్లాపూర్‌ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం ఎదురుగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. బొంతలు కుట్టి భార్యాభర్తలు జీవనం సాగిస్తున్నారు. పెద్దకుమారుడు ఏసుబాబు ఇంటర్‌ చదువుతున్నాడు. రెండో కుమారుడు వేణు పదో తరగతి చదువుతున్నాడు. మద్యానికి బానిసైన సింహాచలం అప్పులపాలయ్యాడు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం జయరాంనగర్‌లో ఉంటూ వడ్డీవ్యాపారం, డబ్బాల వ్యాపారం సాగించే శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన గౌరీనాయుడుతో సింహాచలానికి స్నేహం ఏర్పడింది. ఇతని వద్ద సింహాచలం వడ్డీకి డబ్బులు తీసుకునేవాడు. గౌరీనాయుడు తరచూ వీరి ఇంటికి వచ్చిపోతుండే వాడు. ఈ క్రమంలో సింహాచలం భార్య విజయతో గౌరీనాయుడుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల విషయం తెలుసుకున్న సింహాచలం భార్యను మందలించాడు.

see also..

అమ్మాయిలు పుచ్చకాయలతో వినూత్న నిరసన

దీంతో తమకు సింహాచలం అడ్డువస్తున్నాడన్న నెపంతో వారు శుక్రవారం రాత్రి సింహాచలం గొంతుకు నైలాన్‌తాడుతో ఉరేసి చంపేశారు. వారిద్దరూ సింహాచలం ఉరేసుకున్నాడని అందరినీ నమ్మించి అంత్యక్రియలకు ఏర్పడుచేస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సింహాచలం శరీరంపై ఉన్న గాయాలను చూసి బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గౌరీనాయుడు పరారీలో ఉండగా, సింహాచలం భార్యను పోలీసులు తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat