ఏపీ ప్రస్తుత అధికార టీడీపీ పార్టీను ప్రముఖ సీనియర్ నటుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి సరిగ్గా ఇరవై ఐదేళ్ళ కిందట సెప్టెంబర్ మాసంలో వెన్నుపోటు పొడిచి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న నారా చంద్రబాబు నాయుడు లాక్కున్నారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ ..
ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.ఈ నేపథ్యంలో నందమూరి వంశానికి చెందిన ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా త్వరలో విడుదల కానున్న ఎమ్మెల్యే మూవీ ఆడియో ఫంక్షన్ ఇటివల జరిగింది.ఈ ఫంక్షన్ లో ప్రముఖ దర్శక నిర్మాత రచయిత పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ వంశ పరంగా చాలా మంది హీరోలవుతారు.కోట్లాది కోట్లు సంపాదిస్తారు.వాళ్ళు మాత్రమే దాచుకుంటారు .
కాని దీనికి హరికృష్ణ ,కళ్యాణ్ రామ్ పూర్తిగా భిన్నంగా ఉన్నారు .ఇది సమయం కాకపోయినా కానీ ఒక్కమాట చెబుతున్న కళ్యాణ్ రామ్ చాలా మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి.సినిమాలో ఎమ్మెల్యేగా కంటే నిజజీవితంలో రాజకీయంలో ఎమ్మెల్యే అయి ప్రజలకు సేవ చేస్తే నాకు చాలా ఆనందం .అదే ఇష్టం .మీకుటుంబం అయిన మరల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను.టీడీపీ పార్టీ మీది .ఎప్పటికైనా ఆ పార్టీ మీసొంతమవుతుందని..మీలాంటి వారు రాజకీయంలోకి వస్తే ప్రజలు బాగుంటారు .సమాజం బాగుపడుతుందని ఆయన మనస్సులోని మాట చెప్పేశారు పోసాని ..