ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపక్ష వైసీపీ పార్టీతోపాటు ఇతర పార్టీలు, సంఘాలు నిర్వహిస్తున్న పోరు ఉధృత రూపం దాల్చింది. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా కోసం నేడు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ రహదారుల
దిగ్బంధం కార్యక్రమానికి మద్దతు తెలిపారు. గుంటూరు నగర శివారులోని అంకిరెడ్డి పాలెం రహదారి వద్ద వైఎస్ జగన్ మద్దతు తెలిపారు. ఈ దిగ్బంధానికి ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
పార్లమెంట్లోనూ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చింది. కాగా, రహదారుల దిగ్భంధానికి ఇతర పార్టీలు, 45 ప్రజా సంఘాలు కూడా మద్దతిచ్చాయి. ఏపి కిప్రత్యేక హోదా, విభజన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ, వామపక్షాల ఆధ్వర్యంలోజాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు జాతీయ రహదారిని దిగ్భందం చేశారు. హైవేపై ఆందోళనలో చేస్తూ వైసీపీ నాయకులు ,కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ క్రమంలో అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలోని సర్కారు బందులు ధర్నాలు చేస్తున్నవార్ని ఎక్కడిక్కడ అరెస్టులు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
ఇక్కడే ఐదు కోట్ల తెలుగు ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే ఒకవేళ టీడీపీ పార్టీ కానీ ,చంద్రబాబు కానీ ప్రత్యేక హోదా పై కేంద్ర సర్కారు మీద పోరాడాలనుకుంటే ..ఉద్యమాలు ,,ధర్నాలు చేస్తున్న అఖిల పక్షంతో కల్సి చేయాలి .లేదా వాళ్ళు చేస్తున్న పోరాటానికి అడ్డు రాకుండా ..అక్రమ అరెస్టులు చేయకుండా ఉండాలి.కానీ విధంగా ఉండకుండా ధర్నాలు రాస్తోరోకులు చేస్తున్న వార్ని రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేయడం వెనక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటో అర్ధమవుతుంది.శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని టీడీపీ పార్టీ సమర్ధించుకునే పని చేయచ్చు.అలా విఘాతం కలగకుండా పోలీసులను భద్రతగా ఉంచి దగ్గర ఉండి మరి సపోర్టు ఇవ్వచ్చు.ఎందుకంటే అక్కడ అఖిల పక్షం చేస్తుంది వాళ్ళ స్వార్ధ రాజకీయాల కోసం కాదు ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును మార్చే ప్రత్యేక హోదా కోసం ..!