రాజా..? నిన్నూ, నీ అందం చూసి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారా..? సిగ్గులేదా..! ఛీ..ఛీ..!! అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళీ. అయితే, 2014 ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మరీ నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు తన ధనబలం, కుఠిల రాజకీయాలతో, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.
see also : .రండి నేను ప్రాణాలర్పిస్తా ..చంద్రబాబు & బ్యాచ్ కు పోసాని సవాలు ..!
అయితే, ఇదే విషయంపై ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని కృష్ణ మురళీ స్పందించారు. చంద్రబాబు నాయుడు తన ధనబలంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు పోసి పశువుల సంతలో.. పశువులను కొన్నట్టు కొన్నారన్నారు. వైఎస్ జగన్ ఎంతో కష్టపడి ప్రచారం చేసి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే.. చంద్రబాబు మాత్రం అమరావతి నిర్మాణం కోసం కేంద్రం మంజూరు చేసిన ధనాన్ని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పశువుల్లా కొనేందుకు ఉపయోగించారననారు.
see also :
ఒకవైపు భారీగా తరలోస్తున్న ప్రజలు ..మరోవైపు ఉన్నఫలంగా భద్రత తగ్గింపు ..!
ఉదాహరణ చెబుతూ.. ఇప్పుడు నాకు అల్రెడీ పెళ్లి అయిందండీ.. ఎవతో వచ్చి.. నీవు నాకు నచ్చావు.. అని చెప్తే.. వెంటనే ఆ విషయాన్ని నా భార్యకు చెప్తే ఎలా ఉంటదండీ..? ఏమోయ్ దీనికి నేను నచ్చానంటా..! దీన్ని కూడా నీతోపాటే ఉంచుకుంటానంటే.. నా భార్య నన్ను చీల్చి చెండాడదూ.. అంటూ చంద్రబాబుపై ఫన్నీ కామెంట్ చేశారు పోసాని. ఏదేమైనా ఓటుకు నోటుకేసులో చంద్రబాబు ఎప్పటికైనా జైలుకు పోవడం ఖాయమని పోసాని కృష్ణమురళీ కన్ఫాం చేశారు.