తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి. కార్పొరేషన్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. స్థానిక నాయకులు దేవాలయ అర్చకులు చైర్మన్ గారికి ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు.
దేవాలయ నిర్వాహణ, పరిసరాల పరిశుభ్రత పై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సర్వధర్మ పరిపాలన సాగిస్తూ రంజాన్, క్రిస్టమస్, బతుకమ్మ లాంటి పండుగలను ప్రభుత్వమే నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించారు.
ప్రముఖ దేవాలయాలైన యాదాద్రి, వేములవాడ, ధర్మపురి లాంటి క్షేత్రాలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశ గా ముందుకు తీసుకెళ్తున్నారని తాడూరి తెలిపారు. ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లో బాసర దేవాలయానికి 50 కోట్లు కేటాయించినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.