ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్. గుంటూరు జిల్లా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పెదకూరపాడులో నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్నాయుడు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. జననేత వైఎస్ జగన్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. వేలాది మంది చేతులు పైకెత్తి సీఎం… సీఎం.. అంటూ నినదించారు. ‘గుంటూరు జిల్లా అంటే నాన్నకు ప్రాణం. ఈ జిల్లాను గుండెల్లో పెట్టుకున్నారు’ అని జగన్ ప్రసంగించగానే ప్రజలు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తమకు జరిగిన మేలును గుర్తుచేసుకున్నారు. పులిచింతల ప్రాజెక్టు పేరును ప్రస్తావించగానే ‘అంతా ఆ మహానేత పుణ్యం’ అని రైతులు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాలనలో ఈ ప్రాజెక్టులో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిందన్నారు.
అంతేగాక ఈమధ్య కాలంలో తెలుగులో ఓ సినిమా రిలీజ్ అయ్యిది. ఆ సినిమా పేరు ఎమ్మెల్యే. అదేనండి నందమూరి కళ్యాణ్ రామ్ ,కాజల్ జంటగా నటించిన సినిమా. అయితే సినిమాలో ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్ అని అర్థం. కాని మీ నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం ఎమ్మెల్యే అంటే ‘మామూళ్లు లంచాలు తీసుకునే అబ్బాయ్’ అన్నట్లుగా పరిస్థితి తయారైందంటూ ఛలోక్తులు విసిరారు జగన్. ఇసుక ఫ్రీ అన్నారు. ఎక్కడా ఇచ్చింది లేదు కాని ఒక ట్రక్కు ఇసుకను మూడింతలు పెంచేశారన్నారు. రాష్ట్ర ప్రజల్ని దోచుకుని తింటూ.. ఎమ్మెల్యేలూ.. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు వాటాలు పంచుకుంటున్నారన్నారు. సీఎంకి ఇంత, చినబాబుకి ఇంత, ఎమ్మెల్యేలకు ఇంత అంటూ రేట్లు ఫిక్స్ చేసుకుని మరీ దోచుకుంటున్నారన్నారు.