ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసేవన్నీ చుప్కే పాలిటలిక్సేనంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే, మంత్రి ఆది నారాయణరెడ్డి. కాగా, ఇవాళ మంత్రి ఆది నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. అసలు వైఎస్ జగన్ రాజకీయాలకు పనికి రారని, రాష్ట్రం అభివృద్ధిని కోరుకోకుండా.. రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో వైఎస్ జగన్ ముదు వరుసలో ఉంటారని ఎద్దేవ చేశారు మంత్రి ఆది నారాయణరెడ్డి. అధికార పార్టీ వాళ్లను కాల్చేస్తా.., చంపేస్తా, చొక్కా విప్పుతా, నిక్కరు విప్పుతా, అమ్మకు పుట్టావా..? అబ్బకు పుట్టావా..? వంటి పదాలను ఉపయోగిస్తున్న జగన్ రాజకీయాలకు నూటికి నూరు శాతం అన్ఫిట్ అని తేల్చేశారు.
వైఎస్ జగన్ పాదయాత్ర పేరుతో చేస్తున్న చుప్కే పాలిటిక్స్ను ఎవ్వరూ నమ్మరు. వైఎస్ జగన్ ఓ మానవమృగంతో సమానం, జగన్ సమాజంలో కాకుండా అడవుల్లో ఉంటేనే సమాజానికి మంచిది అంటూ హితవు పలికారు మంత్రి ఆదినారాయణరెడ్డి. 2017 చంద్రబాబు దిగిపోతాడు, ఆ తరువాత నేనే సీఎం అంటూ ప్రజలకు చెప్పావు. మళ్లీ 2019లో కూడా చంద్రబాబు దిగిపోతాడు, ఆ తరువాత నేనే సీఎం అవుతానంటూ జగన్ చెప్పుకుంటూ తిరుగుతున్నారని, జగన్ పట్టపగలే కలలు కంటూ ఊహాలోకంలో విహరిస్తున్నారని విమర్శించారు.