తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్లు ఇవాళ దేశరాజధాని డిల్లీ లో తెలుగులో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ వెంకయ్యనాయుడు వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. తరువాత ఈ ముగ్గురు సభ్యులు.. వెంకయ్యనాయుడును కలిసి ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య కూడా వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎంపీల ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్యసభ సభ్యులంతా బల్లలు చర్చి.. శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అధినేతకు అండగా.. ఉద్యమానికి దన్నుగా.. జోగినిపల్లిజోగినిపల్లి సంతోష్కుమార్ టీఆర్ఎస్ ఆవిర్భావం కంటే ముందు నుంచే కేసీఆర్ వెంట నడిచారు. ఎప్పుడూ చిరునవ్వుతో పలుకరిస్తూ కనిపించే సంతోష్కుమార్ను అంతా సంతన్న.. అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఉద్యమకాలంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు అప్పగించిన ప్రతి బాధ్యతనూ విజయవంతంగా పూర్తిచేశారు. ఉద్యమనేతగా కేసీఆర్ కరీంనగర్ నుంచి ఆమరణ దీక్షకు బయలుదేరుతున్న సమయంలో ఆనాటి పాలకులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించినప్పుడు.. అక్కడి నుంచి నిమ్స్కు తరలించేవరకు సంతోష్కుమార్ అధినేత వెన్నంటే ఉన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు నుంచీ సీఎం కేసీఆర్కు చేదోడువాదోడుగా ఉన్న సంతోష్కుమార్.. ఇప్పటివరకు ఎలాంటి పదవులు ఆశించకుండా పనిచేస్తున్నారు. ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అధినేత వ్యక్తిగత విషయాలతోపాటు పార్టీకి, కార్యకర్తలకు, నేతలకు సమన్వయకర్తగా, అందరికీ తలలో నాలుకలా మెదులుతున్నారు. సమస్య ఎంత క్లిష్టమైనా సరే.. ఓపిగ్గా పరిష్కరించి, వినయంగా నిలబడే నిండైన వ్యక్తి. పార్టీలో సీనియర్ నేతల నుంచి కిందిస్థాయి కార్యకర్తల దాకా ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తారు. పార్టీలో వివాదరహితుడిగా తనకంటూ మంచిపేరు సంపాదించుకున్నారు. మలిదశ ఉద్యమానికి దివిటీగా నిలిచి, తెలంగాణ గుండె చప్పుడు వినిపించిన టీ న్యూస్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు భుజానికెత్తుకున్నారు.
Posted by Jatoth Bharath on Wednesday, 4 April 2018