తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కోదాడ బాలాజీ నగర్లో దారుణమైన సంఘటన జరిగింది.ఈ క్రమంలో తన ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దుండగులు కత్తులతో దాడి చేశారు .
దాడి అనంతరం ఇంట్లో ఉన్న ఏడు తులాల బంగారు ఆభరణాలను దొంగిలించుకుపోయారు .దుండగులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు బాధిత మహిళ బర్మవాత్ లక్ష్మీ ప్రాణాలను కోల్పోయింది .
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి ..మృతదేహాన్ని పోస్ట్ మర్డర్ కు పంపించారు .కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .