ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో రెండో రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ముగియనుండటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలుపై కేంద్రాన్ని నిలదీయడానికి మద్దతు కావాలని జాతీయ స్థాయిలో పలు పార్టీల మద్దతును కోరాలని వెళ్లారు.అయితే వెళ్ళిన మొదటి రోజే ఆయన ఢిల్లీకి వెళ్ళింది ప్రజల సమస్యలను తీర్చడానికి కాదు ..
కేవలం పబ్లిసిటీ కోసమే అని పార్లమెంటు ఆవరణంలో ఫోటోలకు పోజులివ్వడంతో ఆర్ధమైంది.ఆ సంగతిఅటుంచితే నారా చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ తమ ఆస్థాన మీడియాలో తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ తమకు మద్దతు ఇచ్చింది అని ఉదయం నుండి రాత్రి వరకు విరామం లేకుండా అరిగిపోయిన రికార్డులా ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ అంశం గురించి ప్రముఖ తెలుగు మీడియా న్యూస్ ఛానల్ అన్నాడీఎంకే నేత తంబిదొరను సంప్రదించగా అసలు విషయం చెప్పారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు మిత్రుడని..తనను ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాలని కానీ ..అవిశ్వాస తీర్మానం కోసం కానీ మద్దతు అడగలేదు అని
ఖరాకండిగా తేల్చి చెప్పారు..అయితే తంబిదొర మాట్లాడిన ఎక్స్ క్లూజీవ్ వీడియో మీకోసం ..మీరు ఒక లుక్ వేయండి ..