గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికారం కోసం ,పదవుల కోసం పార్టీ మారిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి కట్టబెట్టి పార్టీ మారినందుకు ఆమెకు తగిన ప్రతిఫలం అందించిన సంగతి విదితమే.అయితే భూమా అఖిల ప్రియ అయిన దగ్గర నుండి కింది స్థాయి టీడీపీ క్యాడర్ నుండి పైస్థాయి వరకు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి యొక్క ముఖ్య అనుచవర్గం ,ముఖ్యంగా భూమా అనుచరుల్లో ప్రధానమైన ఏవీ సుబ్బారెడ్డిను పట్టించుకోవడమే మానేసింది .ఇటు పార్టీ వ్యవహారాల్లో కానీ అటు అధికారక వ్యవహారాల్లో కానీ తగిన ప్రాధాన్యం కల్పించకుండా ..ఏకంగా సమస్యలు చెప్పుకుందామని ఇటు ఆళ్లగడ్డ అటు నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గంతో పాటుగా జిల్లా పార్టీ క్యాడర్ ,భూమా ఫ్యామిలీ ను నమ్ముకొని ఉన్న అనుచవర్గంతో పాటుగా ప్రజలను సదరు మంత్రి దగ్గరకు రానివ్వడంలేదు .
See Also:జగన్ అక్రమాస్తుల కేసుల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ..!
అయితే మంత్రి పదవి దక్కడంతో ఆకాశంలో ఎగురుతున్న మంత్రి అఖిల ప్రియను కిందకు దించాలని స్థానిక ప్రజలు ,పార్టీ క్యాడర్ నిర్ణయించుకున్నారు.అందులో భాగంగా భూమా కుటుంబానికి చెందిన వార్తలను నంద్యాల సిటీ కేబుల్లో ప్రచారం చేయడాన్ని నిషేధించారు .అయితే ముందు మంత్రి అఖిల ప్రియ వార్తలను మాత్రమే నిషేధించాలని సిటీ కేబులు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు .ఆ తర్వాత నంద్యాల ఎమ్మెల్యే అయిన భూమా బ్రహ్మానందరెడ్డి వార్తలను కూడా నిషేధించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు .
అయితే ఇటు పార్టీను నాశనం చేయడమే కాకుండా నమ్ముకున్న అనుచవర్గాన్ని ,ప్రజలను ,ఓట్లేసి గెలిపించుకున్న ఓటర్లను మంత్రి అయిన తర్వాత భూమా అఖిల ప్రియ పట్టించుకోకపోవడం..మామా ఏవీ సుబ్బారెడ్డి చాటున ఎదిగిన మంత్రి అఖిల ప్రియ ఆయనపై కుట్రలు పన్నుతూ ..అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన ఆస్తులను కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుండటంతో స్థానిక నేతల ,కార్యకర్తల మనోభిష్టం మేర ఏవీ సుబ్బారెడ్డి సదరు సిటీ కేబులు వారికి ఆదేశాలిచ్చారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలొస్తున్నాయి ..