Home / ANDHRAPRADESH / త్వరలోనే బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అవినీతిపై సీబీఐ విచారణ ..!

త్వరలోనే బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అవినీతిపై సీబీఐ విచారణ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అటు టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .అయితే త్వరలోనే తనపై కేంద్ర సర్కారు సీబీఐ
విచారణకు ఆదేశాలు ఇవ్వడం ఖాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళ దగ్గర వాపోయారు .ఇటివల ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళతో మాట్లాడుతూ “గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డట్లు ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ,మన మిత్రపక్షమైన
బీజేపీ పార్టీ ప్రధాన ఆరోపణలు చేస్తుంది.

ఇప్పటికే వైసీపీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి అందుకు తగ్గ ఆధారాలు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ,బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన అమిత్ షా ,ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కి సమర్పించారు అని ఇంటిల్ జెన్స్ వర్గాలు తనకు నివేదికలు ఇచ్చాయి .అయితే త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల తర్వాత కేంద్రం మన ప్రభుత్వ అవినీతిపై ఫోకస్ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి .

ఎన్నికల తర్వాత మనకు ఇబ్బందులు తప్పవు అని బాబు తమ్ముళ్ళ దగ్గర వాపోయారు అని సమాచారం .అయితే తనని కేంద్రం విచారణ చేయిస్తుందని తెలుసుకున్న బాబు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేలా ప్రచారం చేయాలనీ కూడా తెలుగు తమ్ముళ్ళకు సూచనలు సలహాలు ఇచ్చారు .అందుకే ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఏకంగా బెంగుళూరు లో ప్రెస్ మీట్ పెట్టి మరి బీజేపీ పార్టీకి ఓట్లు వేయద్దు..కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పడం వెనక త్వరలోనే బాబు సర్కారు అవినీతిపై సీబీఐ విచారణ చేయనున్నట్లు అర్ధమవుతుంది .చూడాలి మరి ఇప్పటికే పద్దెనిమిది కేసుల్లో స్టేలు తెచ్చుకున్న బాబు సీబీఐ విషయంలో ఎలా వ్యవహరిస్తారో ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat