Home / SLIDER / టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయం-నియోజకవర్గానికి 100మంది…!

టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయం-నియోజకవర్గానికి 100మంది…!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మన్నలను పొందుతున్న సంగతి తెల్సిందే.రాష్ట్రం ఏర్పడి నాలుగు ఏళ్ళు అయిన కానీ అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలను దాటేస్తూ నెంబర్ వన్ స్థానంలో ఉంది తెలంగాణ .ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికలు మరో ఏడాది దూరంలో ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ బలోపేతానికి సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.

అందులో భాగంగా ఈ నెల ఇరవై ఏడున హైదరాబాద్ మహానగరంలో జరగనున్న ఆ పార్టీ ప్లీనరీ సమావేశానికి నియోజక వర్గానికి వందమంది చొప్పున పిలవాలని నిర్ణయించారు.ఈ క్రమంలో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గ్రామానికి ఒకరో ఇద్దరో ..మండలానికి ఐదుగురు ..నియోజకవర్గానికి పది మంది చొప్పున ఇలా నియోజకవర్గానికి వందమంది చొప్పున ఆహ్వానించి గత నాలుగు ఏండ్లుగా సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ..

రానున్న ఎన్నికల్లో వ్యవహరించాల్సిన విధానం మీద చర్చించడానికి ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు.అందుకు తగ్గట్లు ప్లీనరీ కమిటీలను కూడా ఇప్పటికే ఏర్పాటు కూడా చేశారు .అంతే కాకుండా ప్రస్తుత ఎమ్మెల్యేలు ,ఎంపీలు మొదలు మాజీల వరకు ,వార్డు మెంబర్ నుండి సర్పంచుల వరకు ..ఎంపీటీసీల నుండి జెడ్పీటీసీల వరకు ఎంపీపీ ల నుండి జెడ్పీపీ ల వరకు ఇలా అందర్నీ ప్లీనరీ కు ఆహ్వానించనున్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat