ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజలకిచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను నెరవేర్చడమే కాకుండా విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చి ఆంధ్రుల భవిష్యత్తుకు సహకరించాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేస్తూ ఈ నెల పదహారు తారీఖున ఏపీ బంద్ నిర్వహించాలని ప్రత్యేక హోదా సాధన సమితి పేర్కొంది.
అయితే ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన వైసీపీ ,వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఒక్కరోజు దీక్ష చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారు.
ఈ నెల పదహారున నిర్వహించనున్న బంద్ లో అత్యవసర సేవలను మినహాయిస్తున్నామని అన్నారు .రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న ఈ బంద్ లో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ..