Home / TELANGANA / తెలంగాణ గురుకులాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి

తెలంగాణ గురుకులాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి

తెలంగాణ గురుకులాలను దేశంలోనే నెంబర్ వన్ గురుకులాలుగా తీర్చిదిద్దాలని, వాటిని దేశానికి రోల్ మోడల్ గా మార్చేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జేఈఈ, నీట్ లలో తెలంగాణ గురుకులాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు సాధించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గురుకులాలు దేశంలో మంచి పేరు సంపాదించాయన్నారు. ఇదే విధానాన్ని కొనసాగించాలని గురుకులాలను పటిష్టం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ , విద్యాశాఖ గురుకుల సొసైటీల కార్యదర్శులు, విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, విద్యాశాఖ సంచాలకులు కిషన్ , ఇతర అధికారులతో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు సచివాలయంలో గురుకుల విద్యాలయాల పటిష్టతపై సమీక్ష చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకులాలన్నింటిలోనూ ఒకే రకమైన మెనును ఇప్పటికే అమలు చేస్తున్నామని, దీనిని మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. గురుకులాలన్నింటికీ ఒకే పరీక్షా విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వేసవి సెలవుల్లో ప్రతి విద్యా సంస్థను ప్రత్యేకంగా పర్యవేక్షించి అక్కడి వసతులను మెరుగుపర్చాలన్నారు. కిరాయి భవనాల్లో కూడా వసతులు కల్పించాలని, ఏవైనా మరమ్మత్తులు అవసరముంటే వెంటనే చేయాలన్నారు. విద్యార్థులందరికీ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించాలన్నారు. బాలికలకు న్యాప్కిన్స్ సరిపడా ఇవ్వాలని, పది నెలలకు కాకుండా 12 నెలలకు సప్లయ్ చేయాలన్నారు. చాలామంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని, వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రక్తహీనత ఉన్న బాలికలకు ప్రత్యేక పోషకాహారం ఇవ్వాలని సూచించారు. ఇక ప్రతి గురుకులంలో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచాలని, ఒక ఏఎన్ఎం ఉండాలన్నారు. అదేవిధంగా క్రీడలు, ఆటలు ప్రోత్సహించేందుకు పీఈటీ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గురుకుల విద్యాలయంలో సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని, డిజిటల్ క్లాసులు నిర్వహించాలన్నారు.

ఐదు గురుకులాల్లో కల్పించే వసతులు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో కూడా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గురుకులాల ప్రవేశాల్లో కూడా నియోజక వర్గాల్లోని స్థానికులకు కొంత ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రస్తావించారని, దానిని దృష్టిలో పెట్టుకుని అందుకనుగుణంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. కొత్త జిల్లాలను యూనిట్ గా తీసుకుని అడ్మిషన్లు నిర్వహిస్తే ఈ సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుందన్నారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, గిరిజన శాఖ కార్యదర్శి మహేశ్ దత్త ఎక్కా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్, మైనారిటీ శాఖ కార్యదర్శి దానకిషోర్, ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, మైనారిటీ గురుకుల కార్యదర్శి షఫీ, బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బట్టు మల్లయ్య, విద్యాశాఖ గురుకులాల కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat