శ్రీరెడ్డిని వెలేసేందుకు ఏకమైన తెలుగు సినీ ఇండస్ర్టీ ఐదుకోట్ల మంది ఆంధ్రుల గుండు చప్పుడు ప్రత్యేక హోదా కోసం ఏకం కాలేదా..?. అవును, శ్రీరెడ్డి అనే నటి మా అసోసియేషన్లో సభ్యత్వం పొందేందుకు పడరాని పాట్లు పడుతూ, చివరకు మెంబర్షిప్ ఇవ్వకపోవడంతో అర్ధనగ్నంగా నిరసన తెలిపితే, వెంటనే మా అసోసియేషన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ శ్రీరెడ్డిని టాలీవుడ్ నుంచి వెలేస్తుందా..? అంటూ మా అసోసియేషన్ అధ్యక్షులు శివాజీరాజాను ప్రశ్నించారు నిర్మాత నట్టికుమార్.
కాగా, ఇవాళ నిర్మాత నట్టికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినీ ఇండస్ర్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విడుదలైన ప్రతీ సినిమాను ఆదరించేది ప్రజలే. వారు థియేటర్కు వెళ్లి సినిమా టిక్కెట్ కొంటేనే సినిమా వాళ్లకు మూడుపూట్లా కడుపు నిండుతోంది. ప్రజలు సినిమా వాళ్లను అభిమానించడమే కాకుండా, తెరపై హీరోలుగా నటించే వాళ్లను గుండెల్లోపెట్టుకునే ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సింది పోయి. కేవలం ఒక్క శ్రీరెడ్డి విషయంలోనే మా అసోసియేషన్ సభ్యులు ఇంతలా రచ్చ చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు నట్టికుమార్. ఉమ్మడి రాష్ట్ర విభజన నాటి నుంచి.. ఇప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసంతో ఏపీ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారన్నారు. శ్రీరెడ్డి విషయం కన్నా.. ప్రత్యేక హోదా మీకు చిన్న విషయంగా కనిపించిందా..? అంటూ మా అసోసియేషన్పై ప్రశ్నల వర్షం కురిపించారు నట్టికుమార్.
టాలీవుడ్లోని పెద్ద హీరో నుంచి. చిన్న హీరో వరకు, బఢా నిర్మాతల నుంచి.. చిన్న నిర్మాతల వరకు, హీరోయిన్లు, డైరెక్టర్లు, సినీ టెక్నీషియన్లు ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఒక్క రోజైనా నిరసన కార్యక్రమాలు చేపట్టాలలని, అందుకోసం ప్రతీ ఒక్కరు సినిమా షూటింగ్స్ను ఆపేయాలన్నారు పిలుపునిచ్చారు నట్టికుమార్.