తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వేసిన పంచ్కు కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్ అయిందని పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత రాష్ట్రం ప్రతిష్టను దిగజార్చే స్థాయికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు దిగజారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల పంజాబ్ టూరిజం, మైనింగ్ శాఖ మంత్రి నవజ్యోత్సింగ్ సిద్ధూ తెలంగాణలో పర్యటించి రాష్ట్ర మైనింగ్ పాలసీపై ప్రశంసలు కురిపించడం, దేశవ్యాప్తంగా ఇలాంటి విధానాలను అమలు చేయాలని పేర్కొనడం తెలిసిన సంగతే. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడాన్ని ఓ నెటిజన్ ట్విట్టర్లో ప్రస్తావించగా మంత్రి కేటీఆర్ స్పందించారు.టీ కాంగ్రెస్ నేతలు కళ్లున్న కబోదులుగా మారిపోయారని ఓ ట్వీట్లో ఆయన మండిపడ్డారు.
see also: అంబేద్కర్ జయంతి రోజున సంచలన విషయం చెప్పిన జగన్..!!
see also :ఆ మహానేత తనయుడి పాదస్పర్శ తాకి పులకరించిన కనకదుర్గమ్మవారధి..!
‘తమ రాష్ట్రంలో అత్యుత్తమ విధానాలు అమల్లో పెట్టేందుకు పంజాబ్కు చెందిన కాంగ్రెస్ మంత్రి తెలంగాణలో పర్యటించారు. తెలంగాణ మైనింగ్ పాలసీ అద్భుతమని ప్రశంసించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ విషయాన్ని చూడలేని కబోదుల్లా మారిపోయి విమర్శలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు మన విధానాలను ప్రశంసిస్తుంటే…రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేయడం గర్హనీయం. తెలంగాణకు స్కాంగ్రెస్ నేతలు శాపంగా మారారు’ అంటూ ఘాటుగా స్పందించారు.
An objective Minister from Punjab (Congressman) can see how transparent Telangana’s sand mining policy is but our local Scamgress leadership is blind to reality !!
Shame on you Scamgress Telangana for cursing our own state even when other states in the country want to emulate us https://t.co/dQim71h6iX
— KTR (@KTRTRS) April 14, 2018