తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు నిలబడతారనే అంశం మీద క్లారిటీ వచ్చినట్లుంది.గత నాలుగు ఏండ్లుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జూనియర్ నేతల దగ్గర నుండి తలపండిన సీనియర్ నేతల వరకు అందరూ తమ తమ అనుచవర్గం దగ్గర ..నియోజకవర్గాల్లో మేమే ముఖ్యమంత్రులమని ప్రచారం
చేసుకుంటున్న సంగతి విదితమే .
తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కూడా ముఖ్యమంత్రుల అభ్యర్థుల జాబితాలో చేరిపోయారు.శనివారం భారతరాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి.అందులో భాగంగా రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి .
ఈ వేడుకల సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో కుకట్ పల్లి వై జంక్షన్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిగాయి .ఈ ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ ,తదితరులు హాజరయ్యారు.ఈ క్రమంలో సర్వే సత్యనారాయణ కు ఆహ్వానం అందలేదని జిల్లా కలెక్టర్ వైపు తన వ్రేలును చూపిస్తూ రానున్న ఎన్నికల తర్వాత వచ్చేది ..మా ప్రభుత్వమే ..రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని నేనే ..మీ అంతూ చూస్తాను అంటూ కలెక్టర్ ను బెదిరించారు సర్వేబెదిరించారు సత్యనారాయణ ..