తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని పలువురు పార్టీలకి చందిన నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు.
అందులో భాగంగా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కామారెడ్డి జిల్లాకు చెందిన మోస్రా కాంగ్రెస్ ,బీజేపే పార్టీల గ్రామ కమిటీ అధ్యక్షులు సిరిగిరి భూమయ్యతో పాటు దాదాపు వందమంది ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు ,నేతలు కారేక్కారు.. ఈ క్రమంలో వీరందరికీ మంత్రి పోచారం కండువాలు కప్పి పార్టీలోకి ఇతర నేతలను ఆహ్వానించారు ..