జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నటి శ్రీరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది . ఇవాళ రాష్ట్రరాజధాని హైదరాబాద్ మహానగరంలోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలతి పాటు శ్రీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ ..పవన్ కళ్యాణ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించింది .
పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ని అదుపులో పెట్టుకోలేరా? అంటూ శ్రీ రెడ్డి ప్రశ్నించింది . పవన్ కళ్యాణ్ ఒక్కడికేనా ఫ్యాన్స్ ఉండేది..? మిగతావారికీ కూడా ఉన్నారని..పవన్ కళ్యాణ్ గల్లీ లీడర్ కూడా కాలేరని..ఎవరైనా నన్ను బూతులు తిట్టినా, పిచ్చి పిచ్చిగా మాట్లాడినా కచ్చితంగా మళ్లీ పాత శ్రీ బయటికొస్తుందని ఈ సందర్భంగా తెలిపింది.ప్రస్తుతం కొంతమంది స్క్రీన్ ముందు పతివ్రతలుగా.. ఇండస్ట్రీలో ఏమీ జరగట్లేదు చాలా మంచిదని చెప్పుకునే వారి జాతకాలు మా దగ్గరున్నాయ్. ఇవి ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయి అని పేర్కొంది.