2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ పార్టీ అత్యదికంగా సీట్లు గెలిచిందే కర్నూల్ జిల్లాలోనే. ఏన్నో ఏళ్ల నుండి వైసీపీకి కంచుకోట కడప…దీని తరువాత కర్నూల్ ఉండేది కాని ఇప్పుడు కర్నూల్ తరువాత కడప అనే విదంగా మారింది. అంతలా వైఎస్ జగన్ మీద అభిమానం పెంచుకున్నారు కర్నూల్ జిల్లా ప్రజలు. దీనికి ఉదహరణ కూడ 2014 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ గెలిచిన సీట్లే. అయితే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వందల కోట్లు ఆశ చూపి వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ,ఏంపీలను టీడీపీలో చేర్చుకున్నాడని వైసీపీ నేతలు అంటున్నారు. ఫిరాయింపులపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మరి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కేసు కుడా పెట్టారు. అయిన ఎమ్మెల్యేలు ,ఏంపీలు మారిన ..వారు గెలిపించింది వైసీపీ మీద అభిమానంతోనే..అది ఇప్పటికి అలాగే ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఎలా అంటారా..టీడీపీ అదికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్నటి వరకు ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉంది.. దీనికి తోడు టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారు. ఇందులో బాగంగానే తాజాగా వైఎస్ఆర్ కుటుంబంలో భాగస్వాములవుదామని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటసాని రాంభూపాల్రెడ్డికి ఆయన మద్దతుదారులు ముక్త కంఠంతో సూచించారు.
బుధవారం డోన్ రోడ్డులోని వీజేఆర్ కన్వెన్షన్లో పాణ్యం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో ఆయన సమావేశమయ్యారు. కల్లూరు అర్బన్, రూరల్, ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం మండ లాల నుంచి భారీగా కార్యకర్తలు తరలిరా వడంతో సమావేశ భవనం కిక్కిరిసిపోయింది. మాజీ కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సింగిల్ విండో అధ్యక్షులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ. జిల్లాలో 90 శాతం మంది నాయకులు వైసీపీలో చేరాలని కాటసానికి సూచించారు. అప్పుడు అంటే 2014 ఎన్నికల్లో ఎన్ని సీట్లు అయితే వైసీపీ గెలిచిందో..ఈసారి అదే ఊపుతో కర్నూల్ జిల్లాలో మొత్తం సీట్లన్నీ వైసీపీనే గెలుస్తుంది అని దీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక కాటసాని రాంభూపాల్రెడ్డి .. తన రాజకీయ భవిష్యత్ కోసం కార్యకర్తలు, అనుచరులు చూపుతున్న అభిమానం, ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక హోదా పోరాటంతో రాజకీయ సమీకరణాలు మారాయని..దాంతో పార్టీ మారాల్సి వస్తోందన్నారు. ఖచ్చింతగా 2019 ముఖ్యమంత్రి పీఠంలో వైఎస్ జగనే అని కాటసాని రాంభూపాల్రెడ్డి సభలో అన్నారు.