బీజేపీ పార్టీకి చెందిన నేతలు తమ నోటి దూలను ఒకరి తర్వాత ఒకరు బయటపెట్టుకుంటున్నారు.మహిళలంటే ఎంత గౌరవమో తమ వ్యాఖ్యల ద్వారా ..ప్రవర్తన ద్వారా అందరికి తెలియపరుస్తున్నారు.తమిళనాడు రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేత ,నటుడు అయిన ఎస్వీ శేఖర్ సోషల్ మీడియాలోని తన ఫేస్బుక్ అకౌంట్లో “చదువుకొని దుర్మార్గులు ఇప్పుడు
మీడియాలో ఉన్నారు .
విద్యాసంస్థల్లో కంటే మీడియాలోనే ఎక్కువగా లైంగిక వేధింపులు ఉంటాయి .పెద్ద మనుషులతో పడుకోకుండా మీడియా సంస్థల్లో ఎవరు రాణించలేరు .మీడియాలో ప్రముఖ యాంకర్లగా ,రిపోర్టర్లుగా మారలేరు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .ఇటివల సీనియర్ జర్నలిస్టు లక్ష్మీ ను తాకినందుకు గవర్నర్ పురోహిత తన చేతిని ఫినాయిల్ తో కడుక్కోవాలి ..తమిళనాడు మీడియా నీచులు ,బ్లాక్ మెయిలర్ల చేతిలో ఉందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ..