Home / ANDHRAPRADESH / వచ్చే ఎన్నికల్లో 150 సీట్లకు పైగా వైసీపీ గెలుస్తుంది..!

వచ్చే ఎన్నికల్లో 150 సీట్లకు పైగా వైసీపీ గెలుస్తుంది..!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది.జగన్ ప్రజసంకల్ప యాత్ర నేటికి 141వ రోజుకి ముగిసింది.ఈ క్రమంలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ ఇవాళ నూజివీడుకి చేరుకున్నారు. గాంధీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు .

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో వైసీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లకు పైగా వైసీపీ గెలుస్తుందని అయన ఆశాభావం వ్యక్తం చేశారు. నూజివీడుకి ట్రిపుల్‌ ఐటీ తెచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌దే అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు కృషి చేస్తామని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat