Home / ANDHRAPRADESH / సీఎం చంద్ర‌బాబు మ‌రో అవినీతి కుంభ‌కోణం వెలుగులోకి..!!

సీఎం చంద్ర‌బాబు మ‌రో అవినీతి కుంభ‌కోణం వెలుగులోకి..!!

వెలుగులోకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు భారీ అవినీతి కుంభ‌కోణం..!! అయితే, చంద్ర‌బాబు భారీ అవినీతి కుంభ‌కోణం విష‌యానికొస్తే.. శేఖ‌ర్‌రెడ్డి, ఇత‌ను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాగే, దేశ రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు.. ఏసీబీ, ఈడీ అధికారుల‌కు బాగా సుప‌రిచిత వ్య‌క్తి. ప్ర‌ధాని మోడీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న స‌మ‌యంలో అయితే శేఖ‌ర్‌రెడ్డి పేరు మారు మోగిపోయింది. ఇంత‌కీ అంతలా శేఖ‌ర్‌రెడ్డి పేరు మారుమోగ‌డానికి గ‌ల కార‌ణ‌మేంటి. అంత ఘ‌న‌కార్యం ఏం చేశాడు అత‌ను..? అనుకుంటున్నారా..! అబ్బే అత‌నేం చేయ‌లేదండీ.. అత‌ని వ‌ద్ద ఏసీబీ, ఈడీ అధికారులు, ఐటీ విజిలెన్స్ విభాగాలు జ‌స్ట్. 180 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు, 117 కిలోల బంగారం బ‌య‌ట‌ప‌డింది అంతే..!! అదేంటి అంత భారీ సొమ్మును జ‌స్ట్ అంటూ చీప్‌గా తీసేశార‌నుకుంటున్నారా.. అలా అన‌డానికి కార‌ణాలు లేక‌పోలేదు. శేఖ‌ర్‌రెడ్డి నుంచి ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుంది జ‌స్ట్ 20 శాతమే.. మిగిలిన 80 శాతం సొమ్ము అలానే ఉంది. పై స్థాయి నేత‌ల ఒత్తిడి వ‌ల్ల ఆ 80 శాతం సొమ్ము శేఖ‌ర్‌రెడ్డి వ‌ద్దే ఉండిపోయింది. అందుకే ”జ‌స్ట్‌”.

ఇక అస‌లు విషయానికొస్తే.. ప్ర‌ధాని మోడీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న స‌మ‌యంలో మారుమోగిపోయిన శేఖ‌ర్‌రెడ్డి పేరు ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. అదెలా అంటారా..? ఇటీవ‌ల జ‌రిగిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాన్ ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌తో అన్న మాట‌. ఆ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అవినీతి ప‌రుడు , చంద్ర‌బాబు అవినీతి వార‌స‌త్వాన్ని మంత్రి నారా లోకేష్ తీసుకున్నాడ‌న్నారు. అంతేకాకుండా శేఖ‌ర్‌రెడ్డికి, నారా లోకేష్‌కు అక్ర‌మ లావాదేవీలు ఉన్నాయి. వాటిని త్వ‌ర‌లో బ‌య‌ట‌పెడ‌తాన‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మిస్తున్న కొత్త కంపెనీల్లోనూ శేఖ‌ర్‌రెడ్డికి నారా లోకేష్ వాటా ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఏపీలో శేఖ‌ర్‌రెడ్డికి సంబంధించిన బంగారం వ్యాపారం, కొత్త కంపెనీలు వంటి వ్యాపార లావాదేవీలను నారా లోకేష్ నిర్వ‌హిస్తాడ‌న్న‌ది ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌ల ఆంత‌ర్యం.

అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌ను సీబీఐ, ఈడీ అధికారులు నిశితంగా గ‌మ‌నించి.. ఇటీవ‌ల శేఖ‌ర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించార‌ని, త‌న వ‌ద్ద మిగిలిన 80 శాతం సొమ్ము నారా లోకేష్‌, చంద్ర‌బాబుల‌దే అన్న నిజాన్ని ఒప్పేసుకున్న‌ట్టు ఇటీవ‌ల సోస‌ల్ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డిన విష‌యం తెలిసిందే. అదే గ‌నుక నిజ‌మైతే సీఎం చంద్ర‌బాబుకు, ఆయ‌న త‌న‌యుడు మంత్రి నారా లోకేష్‌కు జైలు క‌న్ఫాం అంటూ ఆ క‌థ‌నం పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్ నిర్వ‌హించిన డిబేట్‌లో పాల్గొన్న జ‌న‌సేన విజ‌య రామ‌రాజు సీఎం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం చంద్ర‌బాబు మ‌హారాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి భార్య‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో మెంబ‌ర్‌గా నియ‌మించ‌డం వెనుక‌గ‌ల అస‌లు గుట్టును ర‌ట్టు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నోట్ల ర‌ద్దు చేయ‌బోతున్నార‌న్న స‌మాచంర తెలుసుకున్న చంద్ర‌బాబు.. త‌న వ‌ద్ద ఉన్న అవినీతి సొమ్మునంతా మ‌హారాష్ట్ర ఆర్థిక మంత్రి ద్వారా.. అంబానీ స‌హాయంతో మార్పించాడ‌ని, ఆ నేప‌థ్యంలోనే ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిసేందుకు అంబానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చాడ‌న్న‌ది జ‌న‌సేన విజ‌య రామ‌రాజు ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat