తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్,ఎంపీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వట్టివాగుపై రూ.5.83 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత డబుల్ బెడ్ రూం ఇళ్ల పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహనసదస్సులో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసగించారు.
రైతులకు ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడిగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తర్వాత అంత భారీ సంఖ్యలో జగిత్యాలలో డబుల్బెడ్రూం ఇండ్ల శంకుస్థాపన చేశామని.. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని.. పేదలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల 72 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. జగిత్యాల ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావుతోపాటు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Minister @KTRTRS addressing the gathering at Rythu Bandhu awareness program in Jagtial. pic.twitter.com/YmlZPdYNtW
— Min IT, Telangana (@MinIT_Telangana) April 24, 2018