Home / ANDHRAPRADESH / వైసీపీ స‌ర్పంచ్‌పై మార‌ణాయుధాల‌తో హ‌త్యాయ‌త్నం..!!

వైసీపీ స‌ర్పంచ్‌పై మార‌ణాయుధాల‌తో హ‌త్యాయ‌త్నం..!!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి. తమకు ఓట్లేసి గెలిపించిన స్థానిక ఓటరు దగ్గర నుండి ..అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న సామాన్యుడి దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలవరకు అందరిపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా, త‌మ‌కు లొంగ‌ని వారిని చంపుతామ‌నే బెదిరింపుల‌తో లొంగ‌దీసుకోవ‌డం ప‌చ్చ‌నేత‌ల వంతైంది.

see also : భూమా ఫ్యామిలీ పొలిటిక‌ల్ ఛాప్ట‌ర్ క్లోజ్‌..!!

ఇటీవ‌ల కాలంలో తాడిపత్రిలో వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్ రెడ్డిపై అక్ర‌మ హ‌త్యాయ‌త్నం కేసుపెట్టిన టీడీపీ స‌ర్కారు తాజాగా క‌ర్నూలు జిల్లా సుభాష్‌పురం వైసీపీ స‌ర్పంచ్ మ‌నుమంతుపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. కాగా, ప‌త్తికొండ నుంచి బైక్‌పై వెళ్తుండ‌గా హ‌నుమంతు.. జీపుతో ఢీకొట్టిన దుండ‌గులు ఆపై మార‌ణాయుధాల‌తో హ‌నుమంతును హ‌త్య‌చేసేందుకు య‌త్నించారు. అయితే, దుండ‌గుల దాడి నుంచి త‌ప్పించుకున్న స‌ర్పంచ్ హ‌నుమంతును స్థానికులు క‌ర్నూలు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. టీడీపీ నేత‌లే త‌న‌ను చంపాల‌ని చూశార‌ని, సోమ‌శేఖ‌ర్‌గౌడ్‌, ఆది నారాయ‌ణ‌, ల‌క్ష్మ‌న్న‌లు త‌న‌ను హ‌త్య చేసేందుకు య‌త్నించార‌ని స‌ర్పంచ్ హ‌నుమంతు మీడియాకు వెల్ల‌డించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat