టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో ,స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ మొటమొదటి సారిగా దర్శకత్వం వహిస్తుండగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య .అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్నారు .ఈ మూవీను వచ్చే నెల నాలుగో తారీఖున విడుదల చేయనున్నట్లు ఈ చిత్రం యూనిట్ ప్రకటించింది .
దేశభక్తి నేపథ్యంలోవస్తున్న ఈ మూవీకు సంబంధించిన తాజా టైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది.హీరో అల్లు అర్జున్ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు .మూవీ టైలర్ లో చావు రాకముందు చచ్చిపోవడమే అంటూ చెప్పిన డైలాగ్ తో ఈ టైలర్ సంచలనం సృష్టిస్తుంది .మీరు ఒక లుక్ వేయండి ..