Home / SLIDER / తెలంగాణ జనసమితి సభ ప్రధాన వేదికపై వెయ్యి మంది ..!

తెలంగాణ జనసమితి సభ ప్రధాన వేదికపై వెయ్యి మంది ..!

తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పదవికి నిన్న శనివారం రాజీనామా చేసిన ప్రో కోదండరాం గతంలో తెలంగాణ జనసమితి పేరిట కొత్త రాజకీయ పార్టీను పెట్టిన సంగతి విదితమే .అందులో భాగంగా నేడు ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో సరూర్ నగర్లో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక జరగనున్నది .

అందులో భాగంగా ఈ వేడుక సందర్బంగా బహిరంగ సభ జరగనున్నది .ఈ సభకు ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై దాదాపు వెయ్యి మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆ పార్టీ నేతలు మీడియాకు వివరించారు .అందులో భాగంగా మొదటి వరసలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులు ,తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న విద్యార్థులు కుటుంబాలు ,బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat