గులాబీ దళపతి ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు టూర్ లో భాగంగా ఆదివారం చెన్నై పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే.ఈ పర్యటన సందర్భంగా సీ ఎం కేసీఆర్ కు అక్కడి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు .సీఎం కేసీఆర్ను చూసేందుకు ఎయిర్పోర్టు, కరుణానిధి నివాసం, స్టాలిన్ నివాసం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు . దేశ్కి నేత కేసీఆర్ అంటూ తమిళంలో, హిందీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తమ ఇంటికి వచ్చిన కేసీఆర్, ఆయన బృందానికి డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు.
స్టాలిన్ సతీమణి దగ్గరుండి మరీ కేసీఆర్ బృందానికి అరటి ఆకుల్లో వడ్డించారు. ఈ వంటకాలను ఆమె స్వయంగా చేశారని స్టాలిన్ ఈ సందర్భంగా కేసీఆర్కు తెలిపారు . వంటకాలు రుచికరంగా ఉన్నాయంటూ కేసీఆర్ ఆమెను అభినందించారు. వచ్చే నెల 10న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి స్టాలిన్ రానున్నారని, ఆ సమయంలో మీరు కూడా తప్పకుండా రావాలని స్టాలిన్ సతీమణిని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. తన సతీమణి శోభ కూడా మిమ్మల్ని తమ ఇంటికి ఆహ్వానించాల్సిందిగా కోరినట్టు ఈ సందర్భంగా తెలిపారు. తమ ఇంటి భోజనం కూడా రుచి చూడాలని కోరారు.