Home / ANDHRAPRADESH / కర్నూల్ జిల్లాలో వైఎస్ జగన్ హావా..కాటసాని రాంభూపాల్ రెడ్డి తరువాత వైసీపీలోకి మరో బీజేపి నేత

కర్నూల్ జిల్లాలో వైఎస్ జగన్ హావా..కాటసాని రాంభూపాల్ రెడ్డి తరువాత వైసీపీలోకి మరో బీజేపి నేత

కర్నూల్ జిల్లాలో రాజ‌కీయం వేడెక్కుతుంది. గత నాలుగు సంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పాలన అత్యంతా దారుణంగా ఉందని రాజకీయ నాయకులే కాక.. సామాన్య ప్రజలు కూడ చెబుతున్నారు. అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ అయిన టీడీపీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తీరేక‌త ఉండడంతో ప్ర‌తిప‌క్ష‌ పార్టీ వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి.

ఇటీవలనే కర్నూలు జిల్లా సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే కాటాసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. కృష్ణా జిల్లా కనుమూరు సమీపంలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్‌ను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. తాజాగా కాటసాని రాంభూపాల్ రెడ్డి సారథ్యంలో వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు బుధవారం కల్లూరులోని ఆయన నివాసంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఏ సలాం వైసీపీలో చేరారు. బీజేపీ పదవికి రాజీనామా చేసి అధిష్ఠానానికి పంపినట్లు ఎస్‌ఏ సలాం తెలిపారు. పాణ్యంలో వైసీపీని బలోపేతం చేసి కాటసానిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని..అందుకే వైసీపీలోకి చేరుతున్నానని ఎస్‌ఏ సలాం తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat