Home / NATIONAL / కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పుల దాడి

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పుల దాడి

కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం తమిళనాడులో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఆమెకు చేదు అనుభవం ఏర్పడింది.ఆమె కాన్వాయ్‌పై డీఎంకే కార్యకర్తలు రాళ్లు, చెప్పుల దాడిచేశారు . కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటులో కేంద్ర ఆలసత్వానికి నిరసనగా వారు ఈ దాడికి పాల్పడ్డారు. గ్రామ్‌ స్వరాజ్‌ అభియోన్‌ పథకం అమలును సమీక్షించేందుకు కేంద్రం దత్తత జిల్లాలైన రామ్‌నాథపురం, విరుధునగర్‌ జిల్లాలో ఆమె పర్యటించారు.ఈ సందర్భంగా డీఎంకే కార్యకర్తలు పార్టీబనూర్‌ జంక్షన్‌ వద్ద కాన్వాయ్‌ను అడ్డగించి ఈ దాడి చేశారు . ఊహించని ఈ పరిణామంతో కేంద్ర మంత్రి ఖంగుతిన్నారు. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని చెదరగొట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఆమె తన పర్యటనను కొనసాగించారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat