Home / TELANGANA / హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం..కేటీఆర్

హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి అంబర్‌పేట్, ఉప్పల్ ఫ్లై ఓవర్లకు, ఆరాంఘర్, మెదక్ రోట్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, అంబర్ పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని..  తెలంగాణలో అద్భుత ప్రజారవాణా వ్యవస్థ ఉందన్నారు. రూ. 23 వేల కోట్లతో స్కైవేలు, ైఫ్లెఓవర్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికే రూ. 3 వేల కోట్ల పనులు నడుస్తున్నాయని.. మరో రూ. 4 వేల కోట్ల పనులు త్వరలో ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.ఉప్పల్ కారిడార్‌తో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. 54 జంక్షన్‌లలో ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు సహకరిస్తున్న కేంద్రమంత్రి గడ్కరీకి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నితిన్ గడ్కరీ మద్దతు ఎంతో ఉందన్నారు మంత్రి కేటీఆర్ .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat