చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు ఏ స్థాయి భద్రత ఉందన్నది తూర్పుగోదావరి జిల్లా లో జరిగింద.ఇ తెలుగుదేవం పార్టీ నాయకులు అతని అనుచరులు ముగ్గురు ఒక బాలికపై అత్యాచార యత్నం చేశారు. ఈ అంశం కలకలం రేపింది. నలుగురు ఘటనా స్థలం నుంచి పలాయనం చిత్తగించారు. ఈ సంఘటన బుధవారం అర్థరాత్రి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం తమ్మాయపేట గ్రామంలో జరిగింది.
see also : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గాంధీతో చంద్రబాబు ఫోటోలు..!!
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కత్తిపూడికి చెందిన టీడీపీ ఎంపీటీసీ కంచిబోయిన సంధ్య భర్త శ్రీనివాస్, ఆయన అనుచరులు రవి, సత్యనారాయణ బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో అన్నవరం నుంచి కత్తిపూడి వెళ్తూ తమ్మయ్యపేట వద్ద ఉన్న టీ దుకాణం వద్ద ఆగారు. ఆ ఇద్దరూ టీ కావాలని డిమాండ్ చేశారు. అయితే, అక్కడ ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నిర్వహిస్తోంది. ఇంత రాత్రి టీ ఏంటని ఆమె ప్రశ్నించడంతో.. తమకే అడ్డు చెబుతావా ..? అంటూ అక్కడే ఉన్న 15 ఏళ్ల కుమార్తెపై పక్కనే ఉన్న తోటలోకి శ్రీనివాస్ అతని ముగ్గురు అనుచారులు లాక్కెళ్లడానికి ప్రయత్నించారు.
see also : వెలుగులోకి మంత్రి నారా లోకేష్ భారీ అవినీతి ..!!
దీంతో బాలిక తల్లి ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగుతు న వచ్చి అడ్డుకున్నారు. దీంతో ఎంపీటీసీ సంధ్య భర్త శ్రీనివాస్ స్థానికులపై దుర్భాషలాడుతూ ప్రభుత్వం తమదని,. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఎదురు తిరిగారు. దీంతో స్థానికులు ప్రతిఘటించడంతో శ్రీనివాస్తో సహా తన ముగ్గురు అనుచరులు అక్కడ్నుంచి వెళ్లి పోయారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు కంచిబోయిన శ్రీనివాస్. పసుపులేటి సత్యనారాయణ, మట్టా రవికుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, పరారీలో ఉన్న మరో నిందితుడు శ్రావణ్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.