ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్నకాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాయ్బరేలీ నియోజకవర్గ ఎమ్మెల్యే అదితీ సింగ్ను పెళ్లాడనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సోశాల్క్ మీడియాలో వైరల్ గా మరీనా ఈ వార్తలకు చెక్ పడింది.పెళ్లి పుకార్లపై ఎమ్మెల్యే అదితీసింగ్ స్పందించడంతో అనేక ఊహాగానాలకు తెరపడింది. రాహుల్ తనకు రాఖీ బ్రదర్ అంటూ ఆమె స్పష్టం చేసింది.
ఆమె ఈ విషయంపై మాట్లాడుతూ..‘ ఈ వార్తలు నన్ను చాలా బాధించాయి. దీనిపై ఇప్పటికైనా నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. రాహుల్ నాకు పెద్దన్నయ్యతో సమానం. ఆయన నాకు రాఖీ బ్రదర్. సోషల్ మీడియాలో సంచలనం అవుతోన్న ఈ వార్తలను విని ఎంతగానో బాధపడ్డా. ఇప్పటికైనా వీటికి ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నాను’ అని ఆమె అన్నారు. అయితే ఈ వార్తలపై సోనియా కానీ, రాహుల్ గానీ స్పందించలేదు.కాగా ఈ వార్తలు మొదటగా రాయ్బరేలీలోని కొందరు వ్యక్తులు వాట్సాప్ వేదికగా ప్రచరారం చేసినట్లు సమాచారం..