Home / SLIDER / కాంగ్రెస్ రైతులకు చుక్కలు చూపిస్తే..మేం చెక్కులు ఇస్తున్నాం..కేటీఆర్

కాంగ్రెస్ రైతులకు చుక్కలు చూపిస్తే..మేం చెక్కులు ఇస్తున్నాం..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగు సంవత్సరాల నుండి చేపడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇప్పటికే వివిధ పార్టీ లనుండి పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.అందులోభాగంగానే రాష్ట్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరై.. ఆ నేతలు, కార్యకర్తలకు టీఆర్‌ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు బతుకు మారిందన్నారు . ఎరువులు, విత్తనాల కోసం రైతులు లైనులో నిలనడాల్సిన అవసరం లేదన్నారు. నాలుగేళ్లలో ఏ ఒక్క రంగాన్నిఅని కాకుండా అన్నింటిని అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండింటినీ సమానంగా ముందుకు తీస్కెళ్తున్నామన్నారు.తు బంధు పథకం రేపటినుంచి అమల్లోకి వస్తుందని… 70 ఏళ్లలో ఎప్పుడూ ఎవరూ చేయని విధంగా రైతు బంధు పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం రైతుబంధు ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. రైతులపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ అని, రైతులను కాల్చి చంపిన చరిత్ర ఆ పార్టీకి ఉందన్న కేటీఆర్.. గత పాలకులు రైతులకు వాళ్లు చుక్కలు చూపిస్తే…మే చెక్కులు ఇస్తున్నామన్నారు. పంట పెట్టుబడి పథకం విప్లవాత్మకమన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat