ఇటు ఏపీలో అటు కేంద్రంలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని పంచుకొని రాసుకొని పూసుకొని తిరిగిన బీజేపీ ,టీడీపీ పార్టీల మధ్య వైర్యం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రేపు జరగనున్న కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓట్లు వేయద్దని టీడీపీ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా
చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ,కర్ణాటక ప్రజలకు పిలుపునిచ్చారు .అయితే తాజాగా కేంద్రం బాబు సర్కారు దిమ్మతిరిగి బొమ్మ కన్పించే బిగ్ షాకిచ్చింది.
ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీ లో 2010 నుండి 2014 వరకు ,ఇప్పటి నవ్యాంధ్ర రాష్ట్రంలో 2014నుండి 2018 ఏఫ్రిల్ వరకు కేంద్రం ఇచ్చిన నిధులు లెక్క ..వాటి వినియోగం తదితర అంశాల గురించి కేంద్రానికి రిపోర్టు పంపాలని బాబు సర్కారును ఆదేశించింది .అయితే గత నాలుగు ఏండ్లుగా జన్మభూమి కమిటీల దగ్గర నుండి రాజధాని నిర్మాణం వరకు ,రోడ్ల నిర్మాణం దగ్గర నుండి ప్రాజెక్టుల నిర్మాణం వరకు దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతి జరిగిందని ..అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేసిన సంగతి తెల్సిందే .
అయితే ఈ పుస్తకాన్ని వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ,ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ఇచ్చారు అని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి .తాజాగా కేంద్రం జారీచేసిన ఆదేశాలను చూస్తుంటే బాబు అండ్ బ్యాచ్ లో భయం మొదలైందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి …