తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెట్టుబడి సాయం కింద రైతు బంధు చెక్కులను అందజేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల పదో తారీఖున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతు బంధు చెక్కులను ప్రారంభోత్సవం చేశారు .
అయితే రైతాంగానికి ప్రభుత్వం ఇస్తున్న పంట పెట్టుబడి సాయం గురించి తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె కృష్ణ సాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి నుండి ఇస్తున్న పెట్టుబడి సాయంతో రైతులు బీర్లు ,సారా త్రాగుతారు .రూ నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఓట్లు దండుకోవడానికే ప్లాన్ చేస్తుందని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు .