ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట అరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర ముగించుకున్న జగన్ గోదావరి జిల్లాలో అడుగుపెట్టాడు .
అయితే ఈక్రమంలో రానున్న ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూనే వస్తున్నారు .తాజాగా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిని ఖరారు చేశారు జగన్ .కైకలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో దూలం నాగేశ్వరరావుకు సీటు ఇవ్వలేదు .కానీ రానున్న ఎన్నికల్లో తప్పకుండ సీటు ఇస్తాను అని ఆయన హామీ ఇచ్చారు ..