ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 160 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జగన్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. అయితే, నేటి సాయంత్రం ప్రజా సంకల్ప యాత్ర కృష్ణా జిల్లాలో కూడా పూర్తి చేసుకుని పశ్చిమగోదావరి జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వనుంది.
see also : భూమ అఖిలప్రియ ఎవరితో..ఎక్కడ..ఎప్పుడు ప్రేమలో పడిందో తెలుసా..!
అయితే, జగన్ చేస్తున్న పాదయాత్ర ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఎప్పటికప్పుడు వైఎస్ జగన్పై ప్రజాదారణ పెరగడం, మరోవైపు పలు టీవీ ఛానళ్లు, రాజకీయ పార్టీలు చేస్తున్న సర్వేల్లోనూ.. వైఎస్ జగన్కే సీఎంగా పట్టం కట్టడం తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సర్వే, మోడీ అనుకూల మీడియా సర్వే, అలాగే, రిపబ్లికన్ టీవీ సర్వేల్లోనూ వైఎస్ జగనే సీఎం అని తేలింది. దీంతో పలు రాజకీయ పార్టీ నాయకులు, నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
అందులో భాగంగానే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన గాదిరాజు సుబ్బరాజు వైసీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని స్వయాన గాదిరాజు సుబ్బరాజు ప్రకటించడం గమనార్హం. అంతేకాక, ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అయితే, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పలువురు రాజకీయ నేతలు వైసీపీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారని, అందులో ఇద్దరు కాంగ్రెస్ మాజీలు కూడా ఉన్నట్టు సమాచారం.